News

మా దగ్గర ఆధారాలు ఉన్నాయి:అచ్చెన్నాయుడు


మంత్రి అచ్చెన్నాయుడు  మే 21న హరీశ్‌రావు, జగన్‌, స్టీఫెన్‌ సన్‌ హోటల్‌లో కలుసుకున్న మాట వాస్తవమని స్పష్టం చేశారు. హోటల్‌లో సీసీ ఫుటేజీని డిలిట్ చేయించారని ఆయన అన్నారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సమయం వచ్చినప్పుడు బయటపెడతామని ఆయన అన్నారు.  జగన్‌ దీక్షకు మేం కూడా కౌంటర్‌గా దీక్ష చేయాలని, రాష్ట్రానికి ఈ గతి పట్టడానికి కారణం వైఎస్‌ కుటుంబమేనని ఆయన విమర్శించారు.